Karimnagar:సరస్వతి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

Massive arrangements for Saraswati Pushkaram

Karimnagar:తెలంగాణలోని భూపాల‌ప‌ల్లి జిల్లా కాళేశ్వ‌రం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని” స‌ర‌స్వ‌తీ న‌దీ పుష్క‌రాలకు ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.అత్యంత ప‌విత్ర‌మైన ఈ త్రివేణి సంగ‌మ స్నానానికి ల‌క్ష‌ల మంది భ‌క్తులు రాష్ట్రం నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా వ‌స్తార‌ని తెలిపారు. స‌ర‌స్వ‌తీ న‌ది పుష్కరాలు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారని, తెలంగాణ ఏర్పడిన వచ్చిన తొలి పుష్కరాలని అన్నారు.

సరస్వతి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

కరీంనగర్, మే 8
తెలంగాణలోని భూపాల‌ప‌ల్లి జిల్లా కాళేశ్వ‌రం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని” స‌ర‌స్వ‌తీ న‌దీ పుష్క‌రాలకు ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.అత్యంత ప‌విత్ర‌మైన ఈ త్రివేణి సంగ‌మ స్నానానికి ల‌క్ష‌ల మంది భ‌క్తులు రాష్ట్రం నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా వ‌స్తార‌ని తెలిపారు. స‌ర‌స్వ‌తీ న‌ది పుష్కరాలు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారని, తెలంగాణ ఏర్పడిన వచ్చిన తొలి పుష్కరాలని అన్నారు. 2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతాయ‌ని, అప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్తి కావాల‌ని చెప్పారు. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. సరస్వతి పుష్కరాల కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్ల వివరాలు భక్తులకు సమగ్రంగా తెలిపేందుకు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి శ్రీధ‌ర్ బాబు ఇటీవ‌ల ప్రారంభించారు. స‌ర‌స్వ‌తీ పుష్కరాలకు వచ్చే భక్తులు, యాత్రికులకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు వాటిని ప్రారంభించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు.

‘సరస్వతీ పుష్కరాలు’ పండుగకు స్నాన ఘాట్ల విస్తరణతో సహా వివిధ అభివృద్ధి పనులను విస్తృతంగా చేపట్టినట్టు ఇరువురు మంత్రులు తెలిపారు. కొన్ని చిన్న చిన్న ప‌నులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని… అవి కూడా పుష్క‌రాలు ప్రారంభమయ్యేలోపు అయిపోతాయ‌ని అధికారుల‌కు మంత్రులు నివేదించారు.ఈ పుష్క‌రాలు విజ‌య‌వంతం నిర్వ‌హించేందుకు త‌మ ప్రభుత్వం చాలా క్రియాశీలకంగా పని చేస్తుందన్నారు మంత్రి. సమ్మక్క సారక్క జాతర, కొమురవెల్లి కల్యాణం, భద్రాచలం కల్యాణం మాదిరి ఈ పుష్క‌రాలు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హించాల‌ని తాము సంక‌ల్పిస్తున్న‌ట్టు చెప్పారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. చలువ పందిళ్లు, టెంట్‌లు, శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివ‌రించారు. కాళేశ్వ‌రానికి సంబంధించిన వివ‌రాల‌న్నీ ఆయా వెబ్ సైట్, యాప్ ద్వారా తెలియజేయాల‌న్నారు.

ఆర్టీసీ బ‌స్సులను అవసరానికి అనుగుణంగా నడపాలని ఆర్టీసీ అధికారుల‌కు సూచించారు మంత్రులు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన ఉచిత బస్సు పథకం ద్వారా దేవాదాయ శాఖకు లాభం చేకూరినట్టు మంత్రి కొండా తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వస్తున్నట్టు మంత్రి కొండా సురేఖ చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖ సూచించారు. ‘ఉత్తరాన ప్రయాగ వద్ద, దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని మంత్రి కొండా తెలిపారు. పవిత్ర సరస్వతీ పుష్కర స్నానం  చేసిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వాసిస్తారని ఆమె తెలిపారు.సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు ఒక పీఠాధిపతి ఈ పుష్కర స్నానం చేయనున్నట్టు మంత్రి కొండా తెలిపారు. పుష్కర ప్రారంభం మే 15, 16వ తేదీన శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్ నుంచి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని సరస్వతి పుష్కరాలు ప్రారంభిస్తారన్నారు.

Read more:Nara Lokesh:లోకేష్ కు కీలక బాధ్యతలు

Related posts

Leave a Comment